SALE OF SOVEREIGN GOLD BONDS IN KARIMNAGAR, JAGTIAL, SIRSILLA, VEMULAWADA

    సావరిన్ గోల్డ్ బాండ్స్
 * సువర్ణావకాశం కేవలం నవంబర్ 21, 2015 వరకు మాత్రమే *
త్వరపడండి
మన భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ లను భారత ప్రజలందరికీ అందించాలని నిర్ణయించిన సంగతి మీకందరికీ విదితమే.  మన ప్రియతమ ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోడీ గారిచే 05-11-2015 వ తేదిన ప్రారంభ మైన సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం కరీంనగర్ పోస్టల్ డివిజన్ లోని కరీంనగర్ మరియు జగిత్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ లలో, సిరిసిల్ల మరియు వేములవాడ సబ్ పోస్ట్ ఆఫీస్ లలో సోమవారం నుండి ప్రారంభిచబడుతుంది. ఈ పథకం యొక్క ప్రధానాంశాలు.

1.                ఈ పసిడి బాండ్ లను భారతీయ పౌరసత్వం కలిగిన వారందరు ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీస్ లలో కనిష్ఠంగా 2 గ్రాముల
            నుండి గరిష్ఠంగా 500 గ్రాముల వరకు తీసుకోవచ్చును.
2.                ఈ యొక్క బాండ్ కొరకు నవంబర్ 21, 2015 లోపు ముందస్తు బుకింగ్ చేసుకోవలెను. నవంబర్ 26, 2015 నుండి బాండ్ లు ఇవ్వబడుతాయి. 
3.                బాండ్ యొక్క ధర క్రితం వారములో ఇండియన్ బుల్లియన్ & జువెల్లెర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 స్వచ్చ
బంగారం ధర యొక్క సగటుని ప్రామాణికముగా తీసుకొని నిర్ణయిస్తారు.
4.                ఈ బాండ్ యొక్క కాల పరిమితి 8 సంవత్సరములు.  5 సంవత్సరముల తరువాత మాచ్యురిటి అవకముందే తీసుకునే
అవకాశం కలదు.
5.                మాచ్యురిటి/రిడెంప్షన్ సమయములో ఇండియన్ బుల్లియన్ & జువెల్లెర్స్ అసోసియేషన్ నిర్ణయించిన బంగారం ధర
ప్రకారం సొమ్ము తిరిగి చెల్లించబడుతుంది.
6.          ఈ యొక్క బాండ్ కి సంవత్సరానికి గాను 2.75% వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించబడుతుంది.

సదా మీ సేవలో…!                                                                                                                జి. శ్రీనివాస మూర్తి
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్

     కరీంనగర్ డివిజన్ - 505001
Share on Google Plus

About SPOs Karimnagar

J. PANDARI, SUPDT OF POST OFFICES, KARIMNAGAR DIVISION, KARIMNAGAR - 505 001 JOINED ON 23-05-2016.
    Blogger Comment

0 comments:

Post a Comment